ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

bible grandham telugu లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

రూతు

1వ అధ్యాయము + -  1. న్యాయాధిపతులు పరిపాలనచేయు కాలమున దేశమున పెద్ద కరువు వచ్చెను. కనుక యూదా రాజ్యమునందలి బేత్లెహేములో నివసించునొకడు తన భార్యను, తన ఇద్దరు కుమారులను తీసికొని మోవాబు దేశమునకు వలసపోయెను. 2. అతని పేరు ఎలీమెలెకు. అతని భార్య పేరు నవోమి. కొడుకుల పేర్లు మహోను, కిల్యోను. వారు ఎఫ్రాతా తెగవారు. వారు మోవాబు దేశమున వసించుచుండగా 3. ఎలీమెలెకు చనిపోయెను. ఇక నవోమికి మిగిలినది ఇద్దరు కుమారులు మాత్రమే. 4. ఆ ఇరువురు మోవాబు యువతులను పెండ్లాడిరి. వారి పేర్లు ఓర్పా, రూతు. వారు ఆ దేశమున పదియేండ్లపాటు జీవించిరి. 5. ఆ పిమ్మట ఆ ఇద్దరు కుమారులు కూడ మరణించిరి. ఆ విధముగ భర్త, పుత్రులు గతింపగా నవోమి ఒంటరిగా మిగిలిపోయెను. 6. ప్రభువు యిస్రాయేలు ప్రజలను కరుణించి వారి దేశమున పంటలు పండించెనని విని ఆమెయు, ఆమె కోడండ్రును మోవాబు నుండి వెళ్ళగోరిరి. 7. కనుక ఆమెయు, ఆమె కోడండ్రులు పయనమై వారితో పయనమై యూదా రాజ్యమునకు పోవు బాటను పట్టిరి. 8. త్రోవలో ఆమె ఇద్దరు కోడండ్రతో "అమ్మలార! మీరిక తిరిగి మీ పుట్టినిండ్లు చేరుకొనుడు. మీరు నాయెడల, ఆ గతించిన వారియెడల మిగుల దయచూపిరి. ప్రభువు కూడ మిమ్ము కరుణతో చూచును గాక! 9. య

యూదా వ్రాసిన లేఖ

1వ అధ్యాయము + -  1. యేసుక్రీస్తు సేవకుడును, యాకోబు సహోదరుడునైన యూదా నుండి, దేవునిచే పిలువబడి, తండ్రియగు దేవుని ప్రేమయందును, యేసుక్రీస్తు రక్షణనందు జీవించువారికి: 2. కృప, శాంతి, ప్రేమ మీయందు విస్తరించునుగాక! 3. ప్రియులారా! మనందరి రక్షణను గూర్చి నేను మీకు వ్రాయ ఆశించితిని. కాని దేవుడు తన ప్రజలకు శాశ్వతముగా ఒసగిన విశ్వాసమునకై మీరు పోరాడు చునే ఉండవలెనని మిమ్ము ప్రోత్సాహపరచుట అవసరమని తోచినది. కనుకనే నేను ఇట్లు వ్రాయుచున్నాను. 4. దొంగచాటుగ మనయందు భక్తిహీనులు కొందరు ప్రవేశించి, మన ఏకైక యజమానుడును, ప్రభువునగు యేసుక్రీస్తును తిరస్కరించి, వారి అవినీతికరమగు ప్రవర్తనను సమర్థించుకొనుటకై దైవకృపను గూర్చిన సందేశమునకు అపార్థములు కల్పించుచున్నారు. వారు తీర్పునకు గురియగుదురు అను విషయము ముందే సూచింపబడినది. 5. మీకు ఈ విషయమంతయు చిరపరిచితమే అయినను, యిస్రాయేలు ప్రజలను ప్రభువు ఐగుప్తుదేశమునుండి రక్షించినప్పటికి వారిలో విశ్వసింపని వారిని తరువాత ఆయన నాశనము చేసిన విషయము మీకు జ్ఞాపకము చేయ తలంచితిని. 6. తమ నియమిత అధికారమును అతి క్రమించి, తమ నివాసములను విడిచిన దేవదూతల వృత్తాంతమును స్మరింపుము. దేవుడు వారిని అధః పాత

కొలొస్సియులకు వ్రాసిన లేఖ

1వ అధ్యాయము + -  1. దేవుని సంకల్పమువలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడయిన పౌలు, మరియు మన సోదరుడైన తిమోతి, 2. క్రీస్తునందు విశ్వాసముగల కొలొస్సీలోని మన సోదరులైన పవిత్రులకు వ్రాయునది: మన తండ్రి అయిన దేవునినుండి మీకు కృప, శాంతి కలుగునుగాక! 3. మేము మీ కొరకు ప్రార్థించునపుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవునకు ఎల్లప్పు డును కృతజ్ఞతలు తెలుపుకొనుచుందుము. 4. ఏలయన, యేసుక్రీస్తుపట్ల మీకుగల విశ్వాసమును పవిత్రులయెడల మీకుగల ప్రేమనుగూర్చి మేము వినియున్నాము. 5. మీయొద్దకు వచ్చిన సత్య సందేశమైన సువార్తా బోధవలన మీరు ఆ నిరీక్షణను గూర్చి వినియున్నారు. అది మీ కొరకు పరలోకములో భద్రపరుచబడియున్నది. 6. మీరు దైవానుగ్రహమును గూర్చి మొట్టమొదట విని, అది వాస్తవముగా ఏమియో తెలిసికొనిన నాటినుండి, మీ విషయములో జరిగి నట్లే, సువార్త ఫలములను ఇచ్చుచు విశ్వమంతటను వ్యాప్తి చెందుచున్నది. 7. మన ప్రియతమ సహసేవకుడగు ఎపఫ్రానుండి దీనిని మీరు తెలిసికొంటిరి. అతడు క్రీస్తునకు విశ్వసనీయుడైన మనతోడి సేవకుడు. 8. అతడు ఆత్మయందలి మీ ప్రేమను గూర్చి మాకు చెప్పియున్నాడు. 9. ఈ కారణముచేత మేము మిమ్ములను గూర్చి విన్నప్పటినుండి మీ కొరకు ఎల్లప్పుడున

సోలోమోను జ్ఞానగ్రంధము

సోలోమోను జ్ఞానగ్రంధము 1వ అధ్యాయము + -  1. లోకమునేలు రాజులారా! మీరు న్యాయమును పాటింపుడు. మీ హృదయములను ప్రభువుమీద లగ్నము చేసికొనుడు. చిత్తశుద్ధితో ఆయనకొరకు గాలింపుడు. 2. తనను పరీక్షకు గురిచేయని వారికి, తనను శంకింపని వారికి ఆయన దర్శనమిచ్చును. 3. దురాలోచనము కలవారికి దేవుడు దొరకడు. దేవుని పరీక్షించుటకు సాహసించువారిని ఆయన శక్తి పిచ్చివారినిగా చేయును. 4. జ్ఞానము కపటాత్ముని వరింపదు. అది పాపి హృదయమున వసింపదు. 5. ఉపదేశమునొసగు పవిత్రాత్మము కపటమును అంగీకరింపదు, అది మూర్ఖతను సహింపదు, అన్యాయమును మెచ్చుకొనదు. 6. జ్ఞానము నరులతో స్నేహము చేయు ఆత్మము. కాని, అది దేవుని నిందించువారిని సహింపదు. దేవుడు నరుని అంతరంగమును పరిశీలించును. అతని హృదయాలోచనలను పరీక్షించును, అతని పలుకులను వినును. 7. దేవుని ఆత్మము ప్రపంచమునంతటిని ఆవరించియున్నది. అది ఈ లోకమునంతటిని ఒక్కటిగా ఐక్యపరచుచున్నది నరుడు పలుకు ప్రతి పలుకును ఆ ఆత్మకు తెలియును. 8. అన్యాయమును సమర్థించువాడు తప్పించుకోజాలడు అతనికి న్యాయసమ్మతమైన శిక్ష ప్రాప్తించితీరును. 9. భక్తిహీనుని ఆలోచనలు పరిశీలింపబడును, అతని పలుకులు దేవునికి తెలియజేయబడును, అతడు తన నేరములకు తగిన

Revelation chapter 20 || Telugu Catholic Bible || యోహాను వ్రాసిన దర్శన గ్రంధము 20వ అధ్యాయము

 1. అంతట దివినుండి అవతరించుచున్న ఒక దేవదూతను నేను కనుగొంటిని. అతని చేతిలో అగాధపు తాళపు చెవియు, ఒక బరువైన గొలుసును ఉండెను. 2. సైతాను అనబడు ఆ ప్రాచీన సర్పమును, ఆ భయంకర సర్పమును అతడు పట్టుకొని ఒక వేయి సంవత్సరములపాటు బంధించెను. 3. ఆ దేవదూత, ఆ సైతానును అగాధములోనికి త్రోసి, ఒక వెయ్యి సంవత్సరముల పాటు మానవజాతిని ఆ సైతాను మోసగింపకుండ, ఆ అగాధమునకు తాళము పెట్టి ముద్రవేసెను. తదుపరి కొద్ది కాలము పాటు వానిని తిరిగి విడువవలసి ఉన్నది. 4. పిమ్మట సింహాసనములను, సింహాసనాసీనులగు వ్యక్తులను, అచట నేను చూచితిని. తీర్పు తీర్చు అధికారము వారికి ఇయ్యబడెను. యేసుకు, దేవుని వాక్కుకు సాక్షులుగా శిరచ్ఛేదనము గావింపబడిన వ్యక్తుల ఆత్మలనుకూడ నేను అట చూచితిని. ఆ మృగమునుగాని, దాని విగ్రహమునుగాని వారు పూజింపలేదు. ఆ మృగ చిహ్నమునుకూడ వారు తమ నుదురులపైన గాని, చేతులపై గాని వేయించుకొన లేదు. వారు సజీవులై వచ్చి క్రీస్తుతో పాటు ఒక వేయి సంవత్సరములు పాలించిరి. 5. (మిగిలిన మృతులు వేయి సంవత్సరములు పూర్తియగు వరకును సజీవులు కాలేరు. ఇదియే మృతుల ప్రథమ పునరుత్థానము) 6. ఈ ప్రథమ పునరుత్థానమున పాలుగల వారందరును ధన్యులు, పవిత్రులు. రెండవ మరణమునకు

Revelation chapter 18 || Telugu Catholic Bible || యోహాను వ్రాసిన దర్శన గ్రంధము 18వ అధ్యాయము

 1. అటుపిమ్మట దివినుండి మరియొక దేవదూత వెడలుట కనుగొంటిని. అతని అధికారము చాల గొప్పది. ఆయన భువినంతటిని తన వైభవముచే ప్రకాశింపజేసెను. 2. ఆయన బిగ్గరగా ఇట్లు పలికెను: “ఆమె నశించెను! బబులోనియా మహానగరము పతనమయ్యెను! ఆమె ఇప్పుడు దయ్యములకును, కలుషాత్ములకును నిలయమైనది. అసహ్యకరములును, జుగుప్పాకరములునైన అన్ని రకముల పక్షులు ఇప్పుడు అట నివసించును. 3. ఏలయన, ఆమె తన మద్యమును ప్రజలకు అందరకును పంచి పెట్టి వారిచేత త్రాగించెను. ఆ మద్యము అనునది ఆమె వ్యభిచార వ్యామోహమే. భువియందలి రాజులు ఆమెతో వ్యభిచరించిరి. లౌకిక వర్తకులు ఆమె విపరీత వ్యామోహము వలన భాగ్యవంతులైరి” అని అతడు వచించెను. 4. అంతట దివినుండి నేను మరియొక కంఠధ్వని ఇట్లు పలుకుట వింటిని: “నా ప్రజలారా! బయటకురండు! దానినుండి బయటపడుడు! ఆమె పాపములో మీరు భాగస్వాములు కారాదు! ఆమె శిక్షలలో మీరు పాలుపంచుకొనరాదు. 5. ఏలయన, ఆమె పాపములు ఆకాశమును అంటుచున్నవి. ఆమె దుష్టప్రవర్తనలు దేవునకు జ్ఞాపకము ఉన్నవి. 6. ఆమె మిమ్మెట్లు చూచెనో మీరును ఆమెనట్లే చూడుడు. ఆమె ఒనర్చినదానికి రెట్టింపు ప్రతిఫలమిండు. మీకు ఆమె ఎట్టి పానీయమును ఒసగెనో, ఆమె పానపాత్రను దానికి రెట్టింపు ఘాటైన పానీయముతో ని