1 వ అధ్యాయం + - 1. దేవుని కుమారుడు యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. 2. యెషయా ప్రవక్త వ్రాసిన విధమున: “ఇదిగో నీ మార్గమును సిద్ధమొనర్చుటకు నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను. 3. 'ప్రభు మార్గమును సిద్ధమొనర్పుడు. ఆయన త్రోవను తీర్చిదిద్దుడు' " అని ఎడారిలో ఒకడు ఎలుగెత్తి పలుకుచుండెను.” 4. ఆ ప్రకారము పాపక్షమాపణ పొందుటకు ప్రజలు హృదయపరివర్తనము అనెడు బప్తిస్మము పొందవలెనని ఎడారియందు యోహాను ప్రకటించు చుండెను. 5. యూదయా దేశస్థులందరు, యెరూషలేము పురవాసులెల్లరు అతనిని సందర్శింపవచ్చిరి. తమ తమ పాపములను వారు ఒప్పుకొనుచుండ, యోర్దాను నదిలో యోహాను వారికి జ్ఞానస్నానము ఇచ్చు చుండెను. 6. యోహాను ఒంటె రోమముల వస్త్రమును, నడుము నకు తోలుపట్టిని కట్టుకొని, మిడుతలను భుజించుచు, పుట్టతేనెను త్రాగుచు జీవించుచుండెను. 7. “నాకంటె శక్తిమంతుడొకడు నా వెనుక రానున్నాడు. నేను వంగి ఆయన పాదరక్షలవారును విప్పుటకైనను యోగ్యుడనుకాను. 8. నేను మిమ్ము నీటితో స్నానము చేయించితిని, కాని, ఆయన మిమ్ము పవిత్రాత్మతో, స్నానము చేయించును” అని యోహాను ప్రకటించుచుండెను, 9. ఆ రోజులలో గలిలీయ సీమలోని నజరేతు నుండి యేసు వచ్చి, యోర్దాను నదిలో యో