1. ప్రభువులకును, అధికారులకును లొంగి యుండి, విధేయులై, ఎట్టి సత్కార్యము చేయుటకైనను సంసిద్ధులై ఉండవలెనని నీ ప్రజలకు గుర్తుచేయుము. 2. ఎవ్వరిని గూర్చికాని చెడుగా మాటలాడక, జగడ మాడక, శాంతముగ ఉండి, అందరితో సౌమ్యముగ ప్రవర్తించుచుండవలెనని వారికి బోధింపుము. 3. మనమే ఒకప్పుడు మూడులుగను, అవిధేయులుగను మోసపోయినవారముగ ఉంటిమి. సర్వవిధములగు మోహములకును, భోగములకును మనము దాసులమైతిమి. ఈర్ష్య ద్వేషములతో మన జీవితము గడిపితిమి. ఇతరులు మనలను ద్వేషించిరి. మనము వారిని ద్వేషించితిమి. 4. కాని, మనరక్షకుడగు దేవునికృపయు, ప్రేమయు ప్రత్యక్షమగుటతో, 5. ఆయన మనలను రక్షించెను, మనము చేసిన సత్కార్యములవలనగాక, తన కనికరము వలననే ఆయన మనలను రక్షించెను. పవిత్రాత్మ ప్రసాదించు నూతన జన్మమునకును, నూతన జీవితమునకును సంబంధించిన జ్ఞానస్నానము ద్వారా ఆ రక్షణ మనకు లభించెను. 6. మన రక్షకుడగు యేసు క్రీస్తు ద్వారా, పవిత్రాత్మను విస్తారముగ దేవుడు మనపై కురియించెను. 7. ఆయన అనుగ్రహము వలన మనము నీతిమంతులమై మనము ఆశించు నిత్యజీవమునకు వారసులమగుటకు ఆయన అటుల చేసెను. ఇది సత్యము. 8. దేవునియందు విశ్వాసముంచువారు సత్కార్య నిమగ్నులై శ్రద్ధవహించుటకుగాను నీవు ఈ వి...