ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఎస్తేరు 2

 1. బిగ్తాను, తేరేషు అను ఇరువురు నపుంసకులు రాజప్రాసాద ప్రాంగణమునకు కావలి కాయుచుండగా మొర్దెకయి వారి దాపున శయనించెను.

2. ఆ నపుంసకులు రాజు మీద కుట్ర పన్నుచుండిరి. మొర్దెకయి ఆ రహస్యమును పసికట్టెను. వారు అహష్వేరోషును హత్యచేయు పన్నాగమున నున్నారని గ్రహించి ఆ సంగతి రాజునకు విన్నవించెను.

3. రాజు ఆ ఇరువురిని బాధలకు గురిచేయగా వారు తమ తప్పిదమును ఒప్పుకొనిరి. అహష్వేరోషు వారిని ఉరి తీయించెను.

4. అతడు ఈ ఉదంతమునెల్ల రాజకార్యముల దస్తావేజున వ్రాయించెను. మొర్దెకయి కూడ ఆ సంగతిని లిఖించి యుంచెను.

5. రాజు మొర్దెకయికి ఆస్థానమున ఉద్యోగమిచ్చి బహుమతులతో సత్కరించెను.

6. అప్పుడు అగారు వంశజుడు హమ్మెదాతా కుమారుడైన హామాను అనువాడు రాజు మన్ననకు పాత్రుడైయుండెను. అతడు మాత్రము ఇరువురు నపుంసకులను చంపించినందులకు గాను మొర్దెకయికి కీడుచేయతల పెట్టెను.

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services