ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఎస్తేరు 2

 1. బిగ్తాను, తేరేషు అను ఇరువురు నపుంసకులు రాజప్రాసాద ప్రాంగణమునకు కావలి కాయుచుండగా మొర్దెకయి వారి దాపున శయనించెను.

2. ఆ నపుంసకులు రాజు మీద కుట్ర పన్నుచుండిరి. మొర్దెకయి ఆ రహస్యమును పసికట్టెను. వారు అహష్వేరోషును హత్యచేయు పన్నాగమున నున్నారని గ్రహించి ఆ సంగతి రాజునకు విన్నవించెను.

3. రాజు ఆ ఇరువురిని బాధలకు గురిచేయగా వారు తమ తప్పిదమును ఒప్పుకొనిరి. అహష్వేరోషు వారిని ఉరి తీయించెను.

4. అతడు ఈ ఉదంతమునెల్ల రాజకార్యముల దస్తావేజున వ్రాయించెను. మొర్దెకయి కూడ ఆ సంగతిని లిఖించి యుంచెను.

5. రాజు మొర్దెకయికి ఆస్థానమున ఉద్యోగమిచ్చి బహుమతులతో సత్కరించెను.

6. అప్పుడు అగారు వంశజుడు హమ్మెదాతా కుమారుడైన హామాను అనువాడు రాజు మన్ననకు పాత్రుడైయుండెను. అతడు మాత్రము ఇరువురు నపుంసకులను చంపించినందులకు గాను మొర్దెకయికి కీడుచేయతల పెట్టెను.