ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సంఖ్యాకాండము చాప్టర్ 13

 1-2. ప్రభువు మోషేతో “ప్రతి తెగకు ఒక్కొక్కని చొప్పున నాయకులను ఎన్నుకొని కనాను దేశమునకు వేగు నడిపింపుము. నేను మీకు ఆ భూమిని ఇచ్చెదను” అని చెప్పెను.

3-15. ప్రభువు ఆజ్ఞాపించినట్లే మోషే పారాను ఎడారినుండి తెగల నాయకులను పంపెను. వారి పేరులివి: రూబేను తెగనుండి సక్కూరు కుమారుడగు షమ్మువా, షిమ్యోను తెగనుండి హోరి కుమారుడగు షాఫతు, యూదా తెగనుండి యెఫున్నె కుమారుడగు కాలెబు, యిస్సాఖారు తెగనుండి యోసేపు కుమారుడగు ఈగాలు, ఎఫ్రాయీము తెగనుండి నూను కుమారుడగు హోషేయ, బెన్యామీను తెగనుండి రాపు కుమారుడగు పాల్టీ, సెబూలూను తెగనుండి సోడి కుమారుడగు గద్దీయేలు, యోసేవు తెగ అనగా మనష్షే తెగనుండి సూసి కుమారుడగు గదీ, దాను తెగనుండి గెమల్లి కుమారుడగు అమ్మియేలు. ఆషేరు తెగనుండి మికాయేలు కుమారుడగు సేతూరు, నఫ్తాలి తెగనుండి వోప్సీ కుమారుడగు నాబి, గాదు తెగనుండి మాఖి కుమారుడగు గేయువేలు.

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services