ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నెహెమ్యా 12

 1. షల్తీయేలు కుమారుడైన సెరుబ్బాబెలుతో, ప్రధానయాజకుడు యోషూవతో ప్రవాసము నుండి తిరిగివచ్చిన యాజకులు, లేవీయులు వీరు:

2-7. సెరాయా, యిర్మియా, ఎజ్రా, అమర్యా, మల్లూకు, హట్టూషు, షెకన్యా, రెహూము, మెరెమోతు, ఇద్దో, గెన్నెతోయి, అబీయా, మియామీను, మాద్యా, బిల్గా, షేమయా, యోయారీబు, యెదయా, సల్లూ, ఆమోకు, హిల్కీయా, యెదాయా. యోషూవ కాలమున వీరెల్లరు యాజకులకు పెద్దలు.

8. లేవీయులలో ఈ క్రిందివారు కృతజ్ఞతాస్తుతులు పాడెడివారు: యేషూవ, బిన్నుయి, కద్మీయేలు, షేరెబ్యా, యూదా, మత్తన్యా.

9. ఈ క్రిందివారు పాటలకు వంతలు పాడెడివారు. బక్బుక్యా, ఉన్నో మరియు వారి తోడివారు. వీరు గాయక బృందమునకు ఎదురు వరుసలో నిలుచుండెడివారు.

10. యేషూవా కుమారుడు యోయాకీము. అతని కుమారుడు ఎల్యాషిబు, అతని కుమారుడు యోయాదా.

11. యోయాదా పుత్రుడు యోనాతాను, అతని కుమారుడు యద్దూవ. 

12-21. యోయాకీము ప్రధాన యాజకుడుగా నున్న కాలమున ఈ క్రింది వారు యాజకుల వంశములకు పెద్దలుగా నుండిరి: సెరాయా ఇంటివారికి మెరాయా, యిర్మీయా ఇంటివారికి హనన్యా, ఎజ్రా ఇంటివారికి మెషుల్లాము, అమర్యా ఇంటివారికి యెహోహానాను, మల్లూకి ఇంటివారికి యోనాతాను, షెబన్యా ఇంటివారికి యోసేపు, హారిము ఇంటివారికి ఆద్నా, మెరాయోతు ఇంటివారికి హెల్కాయి, ఇద్దో ఇంటివారికి జెకర్యా, గిన్నెతోను ఇంటివారికి మెషుల్లాము, అబీయా ఇంటివారికి సిక్రీ, మిన్యామీను ఇంటివారికి మరియు మోవద్యా ఇంటివారికి పిల్టాయి, బిల్గా ఇంటివారికి షమ్మువ, షేమయా ఇంటివారికి యెహోనాతాను, యోయారీబు ఇంటివారికి మత్తెనాయి, యెదాయా ఇంటివారికి ఉజ్జీ, సల్లాయి ఇంటివారికి కల్లాయి, ఆమోకు ఇంటివారికి ఏబేరు, హిల్కీయా ఇంటివారికి హషబ్యా, యెదాయా ఇంటివారికి నెతనేలు.

22. ఈ క్రింది ప్రధానయాజకుల కాలమున యాజకుల కుటుంబములకు, లేవీయుల కుటుంబములకు పెద్దలుగానుండిన వారి జాబితాలను పదిల పరచియుంచిరి. వారు ఎల్యాషిబు, యోయాదా, యోహానాను, యద్దూవ. దర్యావేషురాజు పారశీకమునకు రాజుగ నున్నకాలమున ఈ జాబితా వ్రాయుట ఆపివేసిరి.

23. ఎల్యాషిబు మునిమనుమడైన యోహానాను కాలమువరకు లేవీయుల కుటుంబములకు పెద్దలుగా నుండినవారి జాబితాలను దినవృత్తాంతముల గ్రంథమున పదిలపరిచిరి.

24. హషబ్యా, షేరెబ్యా, యేషూవ, కద్మీయేలు వారి అనుయాయులు నాయకత్వమున లేవీయులను బృందములుగా విభజించిరి. దేవాలయమున ఒక్కొక్కసారి రెండు బృందముల గాయకులు ప్రోగై స్తుతి గీతములను, వానికి వంతపాటలను పాడెడివారు. దైవభక్తుడు దావీదే ఈ నియమము చేసిపోయెను.

25. దేవాలయ ద్వారమునొద్దనున్న వివిధ వస్తుభాండాగారములకు కాపుండిన దేవాలయ ద్వారాపాలకులు వీరు: మత్తన్యా, బక్బూక్యా, ఓబద్యా, మెషుల్లాము, తల్మోను, అక్కూబు.

26. పైన పేర్కొనిన వారందరు యోసాదాకు మనుమడును యేషూవ కుమారుడైన ప్రధానయాజకుడు యోయాకీమునకు, అధికారి అయిన నెహెమ్యాకు, యాజకుడును, ధర్మశాస్త్ర పండితుడునైన ఎజ్రాకు సమకాలికులు.

27. యెరూషలేము నగర ప్రాకారమునకు ప్రతిష్ఠ చేసినపుడు నానా స్థలములనుండి లేవీయులను పిలువనంపిరి. ఆ సమయమున కృతజ్ఞతాస్తుతులతో, స్వరమండలము, చిటితాళము, పిల్లనగ్రోవి మొదలగు వాద్యములతో హృదయానందముగా ఉత్సవము చేసి కోవలెనని సంకల్పించుకొనిరి.

28-29. యెరూషలేము చుట్టుపట్లనున్న నగరములనుండి, నెటోఫానగరము చుట్టుపట్టులనుండి, బేతు, గిల్గాలు, గేబా, అస్మావేతు పట్టణములనుండి లేవీయ గాయకులు వచ్చిచేరిరి. వారెల్లరు యెరూషలేమునకు చేరువలోని పట్టణముల వారే.

30. లేవీయులు, యాజకులు తమ్ముతాము శుద్ధిచేసికొనిరి. ప్రజలను, ప్రాకారమును, దాని ద్వారములను గూడ శుద్ధిచేసిరి.

31. నేను యూదా పెద్దలను గోడమీద సమావేశపరచితిని. వారిని రెండు గాయక బృందములుగా విభజించితిని. మొదటి బృందము గోడమీద కుడివైపు నడచి పేడద్వారము వైపు వెళ్ళెను.

32. వారి వెనుక హోషయా అతనితోపాటు సగముమంది యూదియా నాయకులు నడచిరి.

33-35. అసర్యా, ఎజ్రా, మెషుల్లాము, యూదా, బెన్యామీను, షెమయా, యిర్మీయా అనువారు వెళ్ళిరి. యాజకుల కుమారులలో కొందరు బాకాలూదుచు వారి వెనుక వెళ్ళిరి. వారెవరనగా, షెమయా మనుమడును యోనాతాను కుమారుడునగు జెకర్యా నడచెను. మత్తన్యా, మీకాయా, సక్కూరు, ఆసాపు ఈ జెకర్యాకు మూలపురుషులు.

36. జెకర్యా వెనుక అతని ఇంటికి చెందిన యాజకులు షెమయా, అసరేలు, మిలాలయి, గిలాలయి, మాయి, నెతనేలు, యూదా, హనానీ వచ్చిరి. వారెల్లరు పూర్వము దైవభక్తుడైన దావీదు వాడిన సంగీతవాద్యముల వంటి వాద్యములు కొనివచ్చిరి. ధర్మశాస్త్ర బోధకుడగు ఎజ్రా ఈ మొదటి బృందమునకు ముందు నడచెను.

37. వారు జలధార ద్వారమునొద్ద మెట్లెక్కి దావీదు నగరమున ప్రవేశించి ఆ రాజప్రాసాదము ప్రక్కగా నడచిరి. పిమ్మట జల ద్వారమునొద్ద నగరమునకు తూర్పువైపున మరల ప్రాకారమును చేరుకొనిరి.

38. రెండవ బృందము గోడమీద ఎడమ వైపుగా నడచివెళ్ళెను. నేను వారిననుసరించితిని. మేము కొలిమి ప్రాకారము మీదుగా పోయి మైదానపు గోడను చేరితిమి.

39. అచట ఎఫ్రాయీము, మేషనా, మత్స్య ద్వారమును దాటితిమి. హననేలు బురుజును, మేయా బురుజును, గొఱ్ఱెల ద్వారమును చేరితిమి. కడకు గస్తీద్వారము చేరుకొంటిమి.

40-41. ఈ రీతిగా రెండు బృందములు దేవాలయము చేరెను. మాతోనున్న సగము మంది పెద్దలు మాత్రమేకాక ఈ క్రింది యాజకులు బాకాలూదుచు మావెంట వచ్చిరి: ఎల్యాకీము, మాసెయా, మిన్యామీను, మీకాయా, ఎల్యోయేనయి, జెకర్యా, హనన్యా.

42. ఈ క్రింది గాయకులు ఎస్రహయా నాయకత్వమున పాటలు పాడుచు మా వెంట వచ్చిరి: మాసెయా, షేమయా, ఎలియెజెరు, ఉజ్జీ, యెహోహానాను, మల్కీయా, ఏలాము, ఏసేరు.

43. ఆ దినము ప్రజలు చాలా బలులు సమర్పించిరి. ప్రభువు ప్రజలను సంతోష చిత్తులను చేయగా వారు మిక్కిలి ఆనందించిరి. స్త్రీలు, పిల్లలుకూడ ఉత్సవమున పాల్గొనిరి. ఆ ప్రజల ఉత్సాహ నినాదములు చాలదూరమువరకు విన్పించెను.

44. దేవాలయమునకర్పించెడు ధాన్యము, ఫలములు, పండిన పంటలో పదియవ వంతు, మరియు ఇతర వస్తువులు భద్రము చేయు భాండాగారమునకు పర్యవేక్షకులను నియమించితిని. ధర్మశాస్త్ర విధి ప్రకారము యాజకులకొరకు, లేవీయులకొరకు, ఆయా నగరములకు చెందిన పొలములనుండి ధాన్యాదులు సేకరించుట ఈ పర్యవేక్షకుల పని. యాజకులు లేవీయులు సంతృప్తికరముగా పనిచేసి యూదీయుల మన్నన పొందిరి.

45. దైవారాధనను, శుద్ధీకరణను నిర్వర్తించినది వారే. దావీదు అతని కుమారుడు సొలోమోను విధించినట్లుగనే గాయకులు, దేవాలయ ద్వారపాలకులు తమతమ విధులను పాటించిరి.

46. దావీదు కాలము నుండి ఆసాపునాటినుండి గాయకులు బృందములుగా గూడి ప్రభుని స్తుతించి గానము చేయుచుండిరి.

47. సెరుబ్బాబెలు కాలమున, నెహెమ్యా కాలమున గాయకుల కొరకు, దేవాలయ ద్వారపాలకుల కొరకు యిస్రాయేలీయులందరు ప్రతిరోజు భోజన పదార్ధములు ఇచ్చిరి. ప్రజలు లేవీయులకు కానుకలీయగా, లేవీయులు వానినుండి యాజకులవంతు యాజకులకు పంచియిచ్చెడివారు.