ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

లేవీయకాండము చాప్టర్ 12

1-2. ప్రభువు మోషేను యిస్రాయేలీయులతో చెప్పుమనిన సంగతులివి: “ఏ స్త్రీయైనను ప్రసవించి మగబిడ్డను కనినయెడల, తాను అయినప్పటివలె, ఏడురోజులు శుద్ధినికోల్పోవును.

3. ఎనిమిదవనాడు శిశువునకు సున్నతి చేయవలయును.

4. ఆమె రక్తము శుద్ధిచెందుటకు ఇంకను ముప్పది మూడుదినములు వటును. తన రక్త శుద్ధియగు కాలము ముగియువరకు ఆమె పవిత్ర వస్తువు లను ముట్టరాదు, దేవాలయమునకు వెళ్ళరాదు.

5. కాని ఆమె ఆడుబిడ్డను కనినచో, తాను ఋతుమతియైనప్పటివలె, పదునాలుగు దినములు శుద్ధిని కోల్పోవును. ఆ పిమ్మట ఆమె రక్తము శుద్ధిచెందుటకు ఇంకను అరువదియారు దినములు పట్టును.

6. ఆమె మగబిడ్డను కనినను, ఆడుబిడ్డను కనినను శుద్దికాలము ముగియగనే సంపూర్ణదహనబలికి ఏడాది గొఱ్ఱెపిల్లను, పాపపరిహారబలికి ఒక తెల్ల గువ్వను లేక పావురమును సమావేశపుగుడారము ప్రవేశముద్వారము వద్ద పరిచర్యచేయు యాజకుని యొద్దకు తీసుకొనిరావలయును.

7. యాజకుడు వానిని బలియిచ్చి ఆమె శుద్ధిని బడయుటకు విధిని నిర్వహించును. అప్పుడు ఆమె శుద్ధినిబడయును. ప్రసవించిన స్త్రీని గూర్చిన నియమమిది.

8. కాని ఆమె పేదరాలైయుండి గొఱ్ఱె పిల్లను సమర్పింపలేని యెడల రెండు పావురములనో లేక రెండు తెల్లగువ్వలనో అర్పింపవచ్చును. వానిలో ఒకటి సంపూర్ణ దహనబలికి మరియొకటి పాపపరిహారబలికి వినియోగింపబడును. యాజకుడు ఆమె శుద్ధిని పొందు విధిని నిర్వహింపగా ఆమె శుద్ధినిబడయును.”

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services