ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యెహోషువ 19

1. చీట్లు వేయగా వచ్చిన రెండవవంతు చీటి షిమ్యోను కుటుంబముల వారికి లభించేను. వారి వంతు భూమి యూదీయుల వారసత్వభూమి మధ్య నుండెను.

2-6. వారికి లభించిన పట్టణములు బేర్షెబా, షేబ, మోలడా, హాసారు-షువాలు, బాలా, ఏజెము, ఏల్తోలాదు, బేతూలు, హోర్మా, సిక్లగు, బేత్-మార్కబోతు, హాసారు-సూసా, బేత్-లెబావోతు, షారుహేను వానివాని పల్లెలతో కూడి మొత్తము పదుమూడు నగరములు.

7. అలాగే ఆయిన్, రెమ్మోను, ఏతేరు, ఆషాను వానివాని పల్లెలతో గూడి నాలుగు నగరములు.

8. వీనితో పాటు బాలత్-బేయేరు వరకు నేగెబురామా వరకు వ్యాపించియున్న పల్లెలు అన్నియు వారివే.

9. షిమ్యోను కుటుంబముల వారికి లభించిన వారసత్వభూమి ఇదియే. యూదా తెగవారికి లభించిన భాగము చాల పెద్దది. కనుక షిమ్యోను వారస భూమి యూదా నుండే పంపిణీచేయబడెను. కనుకనే షిమ్యోను తెగకు వచ్చిన వంతు యూదా వారసత్వభూమి మధ్య నున్నది.

10. ఓట్లు వేయగా వచ్చిన మూడవ చీటి సెబూలూను తెగకు లభించెను. వారి నేల సరీదు వరకు వ్యాపించెను.

11. వారి సరిహద్దు తూర్పు వైపున మరాలతు వరకును పోయి దబ్బెషేత్తును యోక్నెయామునకు ఎదుటనున్న వాగును దాటెను.

12. తూర్పు వైపున ఆ సరిహద్దు సరీదు నుండి ఖిస్లోత్తు-తాబోరు వరకు అక్కడి నుండి దాబ్రత్తు వరకును యాఫియా వరకు వ్యాపించెను.

13. అక్కడి నుండి తూర్పుగా బోయి గత్-హెఫెరు ఎత్కాకాసీను చేరెను. అక్కడి నుండి రిమ్మోను దాటిపోయి నేయా చేరెను.

14. ఉత్తరమున హన్నతోను వైపు వంగి యిఫ్తాయేలు మైదానము చేరెను.

15. పైగా కత్తాతు, నహలాలు, షిమ్రోను, ఇదలా, బేత్లెహేము అను పన్నెండు పట్టణములు వాని పల్లెలు వారివే.

16. ఈ పట్టణములు వాని పల్లెలు సెబూలూను తెగవారి వారసత్వభూమి లోనివే.

17. చీట్లు వేయగా నాలుగవవంతు చీటి యిస్సాఖారు తెగవారు పొందిరి.

18. వారి మండలము యెస్రెయేలు వరకు వ్యాపించెను. 

19-21. కేసుల్లోతు, షూనెము, హాఫరాయీము, షియోను, అనహారతు, రబ్బీతు, కిషియోను, ఏబేసు, రేమేతు, ఎన్గన్నీము, ఎన్హద్దా, బెత్పాసేసు నగరములు వారివే.

22. వారి సరిహద్దు తాబోరు మీదుగా పోయి షహసుమా, బేత్- షెమేషు దాటి యోర్దాను చేరెను. అవి యన్నియు వానివాని పల్లెలతో జేరి పదునారు నగరములు.

23. ఈ నగరములు పల్లెలు వారివారి కుటుంబముల ప్రకారము యిస్సాఖారు తెగలకు చెందినవి.

24. చీట్లువేయగా ఐదవవంతు ఆషేరు తెగవారు పొందిరి.

25-26. హెల్కాత్తు, హాలి, బేతెను, అక్షాపు, అల్లమ్మేలెకు, ఆమదు, మిషాలు వారి మండలము లోనివే. పడమట కర్మేలు, లిబ్నాత్తు ఎల్లలు.

27. వారి సరిహద్దు తూర్పువైపున బేత్-దాగోను వరకు పోయి, సెబూలూను చేరి, ఉత్తరమున ఇఫ్తాయేలు లోయచొచ్చి, అటుమీద బెతేమెకు, నెయీయేలుచేరి, ఉత్తరమున కాబూలు వరకును పోయెను.

28. ఎబ్రోను, రేహోబు, హమ్మోను, కానా కలుపుకొని పెద్దసీదోను వరకు పోయెను.

29. ఆ సరిహద్దు అక్కడి నుండి వెనుకకు తిరిగి రామా చేరి తూరు, హాషా దుర్గములను కలుపుకొని సముద్రము చేరెను. మహలబు, అక్సీబు, ఉమ్మ, ఆఫెకు, రహోబు అను ఇరువది రెండు పట్టణములను వారి పల్లెలను గూడ కలుపుకొనెను.

30-31. ఈ పట్టణములు పల్లెలు ఆషేరు తెగకు చెందినవే.

32. చీట్లు వేయగా ఆరవ వంతు చీటి నఫ్తాలి తెగలవారు పొందిరి.

33. వారి మండలము హెరేపు నుండి సనాన్నీము సింధూరము మీదుగా ఆదమీ నేగెబు చేరి యాబ్నీలు నందలి లాక్కూము వరకు పోయి యోర్దాను చేరెను.

34. వారి పడమటి సరిహద్దు ఆస్నోత్తు తాబోరు మీదుగా, హక్కోకు మీదుగా పోయి దక్షిణమున సెబూలూనును, పడమట ఆషేరును, తూర్పున యోర్దానును చేరెను.

35-38. వారి రక్షితపట్టణములు సిద్దీము, సేరు, హమ్మతు, రక్కాత్తు, కిన్నెరెతు, ఆదమా, రామా, హాసోరు, కేదేషు, ఎద్రెయి, ఎన్-హాసోరు, యిరోను, మిగ్ధావేలు, హోరెము, బేత్-అనాతు, బేత్-షెమేషు అనునవి వానివాని పల్లెలతో పాటు పందొమ్మిది

39. ఈ పట్టణములు, పల్లెలు వారివారి పట్టణముల ననుసరించి నఫ్తాలి తెగకు చెందినవి.

40. చీట్లు వేయగా ఏడవవంతు చీటి దానుతెగ వారు పొందిరి.

41-46. సోరా, ఏష్టవోలు, ఈర్షెమేషు, షాలబీను, అయ్యాలోను, ఈత్లా, ఏలోను, తిమ్నా, ఏక్రోను, ఎల్తేకే, గిబ్బెతోను, బాలతు, యెహూదా, బెన్బేరెకు, గాత్రిమ్మోను, మెయార్కోను, యెప్పా వైపుగల నేలతోపాటు రక్కోను వారి మండలముననే కలవు.

47. దానీయులు వారి భూభాగము కోల్పోవుటచే, ఆ తెగవారు బయలుదేరి లేషేము మీద యుద్ధము చేసి, దానిని పట్టుకొని కొల్లగొట్టి, స్వాధీన పరుచుకొని దానిలో వసించి తమ వంశకర్తయగు దాను పేరు మీదుగా ఆ నగరమునకు దాను అని పేరు పెట్టిరి

48. ఈ పట్టణములు పల్లెలు వారివారి కుటుంబముల ననుసరించి దానుతెగకు చెందినవి.

49. ఇంతటితో వంతులువేసి నేలను పంచుకొనుట ముగిసెను. నూను కుమారుడు యెహోషువకు కూడ యిస్రాయేలీయులు తమతోపాటు వారసత్యము నిచ్చిరి.

50. యెహోషువ ఎఫ్రాయీము పీఠభూములలోని తిమ్నాత్-సెరా పట్టణమునడుగగా, యావే ఆజ్ఞ చొప్పున ఆ నగరమును అతనికిచ్చివేసిరి. యెహోషువ పట్టణమును మరల నిర్మించి దానియందు వసించెను.

51. షిలో నగరమున యావే ఎదుట సమావేశపు గుడారము గుమ్మమునొద్ద యాజకుడైన ఎలియెజెరు, నూను కుమారుడగు యెహోషువ, ఆయా కుటుంబముల పెద్దలు కలసి వంతులువేసి యిస్రాయేలు తెగలకు పంచియిచ్చిన వారసత్వభూములివియే. ఈ రీతిగా భూవిభజన ముగిసెను.