ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Psalms 53

1. మూర్ఖులు “దేవుడు లేడు” అని యెంతురు. వారెల్లరును దుష్టులై ఘోరకార్యములను చేసిరి. మంచిని చేయువాడు ఒక్కడును లేడయ్యెను.

2. జ్ఞానముకలిగి తనను వెదకువారు ఎవరైన ఉన్నారేమో చూతమని దేవుడు ఆకసమునుండి నరులవైపు పారజూచును.

3. కాని జనులెల్లరును తప్పుత్రోవ పట్టిరి, ఎల్లరును దుష్టులైరి. మంచిని చేయువాడు ఒక్కడును లేడయ్యెను.

4. నా ప్రజలను భోజనమువలె మ్రింగివేయుచు, దేవునికి ప్రార్థన ఏ మాత్రము చేయని దుష్టులకు జ్ఞానము ఇసుమంతయు లేదా?

5. దేవుడు ఆ భక్తిహీనుల ఎముకలను చిందరవందరచేయును. అచ్చోట ఆ దుష్టులు ఘోరమైన భయమువాత పడుదురు. దేవుడు వారిని నిరాకరింపగా వారు అవమానమున మునుగుదురు.

6. సియోనునుండి యిస్రాయేలును రక్షించు నాథుడెవడు? ప్రభువు తన ప్రజలకు అభ్యుదయము దయచేసినపుడు యాకోబు సంతతియెల్ల సంతసించును. యిస్రాయేలీయులెల్లరు ప్రమోదము చెందుదురు.

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services