ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Luke chapter 20 || Telugu catholic Bible || లూకా సువార్త 20వ అధ్యాయము

 1. ఒకానొక రోజున యేసు దేవాలయములో ప్రజలకు బోధించుచుండగా ప్రధానార్చకులు, ధర్మ శాస్త్ర బోధకులు, ప్రజల పెద్దలు వచ్చి,

2. “ఏ అధికారముతో నీవు ఈ కార్యములను చేయు చుంటివి? నీకు ఈ అధికారమును ఇచ్చినవాడు ఎవ్వడు?” అని ప్రశ్నించిరి.

3. అందుకు యేసు, “నేనుకూడ మిమ్ము ఒకమాట అడిగెదను.

4. యోహాను బప్తిస్మము ఎచ్చటనుండి వచ్చినది? దేవుని నుండియా? లేక మానవుని నుండియా?” అని ప్రశ్నించెను.

5. వారు తమలో తాము, “దేవుని నుండి అని సమాధానము ఇచ్చితిమా, అట్లయిన, మీరేల ఆయనను విశ్వసింపలేదు? అనును.

6. అట్లుగాక, మానవులనుండి అని చెప్పితిమా ప్రజలు మనపై రాళ్ళు రువ్వెదరు. ఏలయన, వారు యోహానును ప్రవక్త అని గట్టిగా నమ్ముచున్నారు” అని తర్కించుకొనిరి.

7. అందుచేత వారు “అది మాకు తెలియదు” అని సమా ధానము ఇచ్చిరి.

8. అంతట యేసు వారితో “అట్లయిన ఏ అధికారముతో ఈ కార్యములు చేయుచుంటినో నేనును చెప్పను” అనెను.

9. యేసు ప్రజలకు ఈ ఉపమానమును వినిపించెను. “ఒకానొకడు ద్రాక్షతోటను నాటించెను. కాపులకు దానిని కౌలుకిచ్చి చాలకాలము దేశాటన మునకు వెడలెను.

10. పంటకాలమున తన భాగమును తెచ్చుటకై కౌలుదారులయొద్దకు తన సేవకుని పంపెను. కాని వారు వానినికొట్టి వట్టిచేతులతో పంపివేసిరి.

11. అతడు మరొక సేవకుని పంపెను. వారు వానిని కూడ కొట్టి, అవమానించి వట్టిచేతులతో పంపివేసిరి.

12. అతడు మూడవవానిని పంపెను. వారు వానిని గూడ గాయపరచి, బయటకు నెట్టివేసిరి.

13. అంతట 'నేను ఏమి చేయవలెను?' అని యజమానుడు అనుకొని 'నా ప్రియకుమారుని పంపెదను. ఒకవేళ వారు అతనిని గౌరవింపవచ్చును' అని తలంచెను.

14. కాని ఆ కౌలుదారులు అతనిని చూడగనే 'వీడే వారసుడు, వీనిని చంపివేసెదము. వీని ఆస్తి అంతయు మనకు దక్కును' అని ఒకరికొకరు చెప్పుకొనిరి.

15. కనుక, వారు అతనిని తోట వెలుపలికి నెట్టి చంపివేసిరి. ఇపుడు ద్రాక్షతోట యజమానుడు వారిని ఏమి చేయును?

16. అతడు వచ్చి ఆ కౌలుదారులను హతమార్చి తన ద్రాక్షతోటను ఇతరులకు కౌలు కిచ్చును గదా!" ఇది విని ప్రజలు “అటులెన్నడు జరుగకుండుగాక!" అనిరి.

17. యేసు వారివైపు తిరిగి “మీరు ఈ లేఖనమును చదువలేదా? 'ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి, ముఖ్యమయిన మూలరాయి అయ్యెను'.

18. ఎవడు ఈ రాతిమీద పడునో, వాడు తునాతున కలగును. ఎవనిపై ఈ రాయిపడునో వాడు నలిగి నుగును” అని పలికెను.

19. ధర్మశాస్త్ర బోధకులు, ప్రధానార్చకులు ఈ ఉపమానమును విని అది తమను గురించియే అని గ్రహించి, ఆయనను అపుడే పట్టుకొనుటకు ప్రయత్నించిరి. కాని ప్రజలకు భయపడిరి.

20. వారు పొంచియుండి, ఆయనను సంస్థాన పాలకునకు అప్ప గించుటకై మాటలలో చిక్కించుకొనవలయునని, నీతిమంతులుగా నటించుకొందరు గూఢచారులను ఆయన యొద్దకు పంపిరి.

21. వారు వచ్చి, “బోధకుడా! నీవు సత్యసంధుడవు. పక్షపాతము లేనివాడవు, దేవుని మార్గమును గూర్చిన వాస్తవము బోధించువాడవు.

22. చక్రవర్తికి సుంకము చెల్లించుట న్యాయ సమ్మతమా? కాదా? అని అడిగిరి.

23. యేసు వారి కుతంత్రమును గుర్తించి, వారిని

24. “సుంకము చెల్లించు నాణెమును నాకు చూపుడు. దానిపై ఉన్న రూపనామధేయములు ఎవరివి?” అని అడిగెను. “చక్రవర్తివి” అని వారు చెప్పిరి.

25. “మంచిది. చక్రవర్తివి చక్రవర్తికి, దేవునివి దేవునకు చెల్లింపుడు" అని ఆయన వారితో అనెను.

26. ఈ విధముగా ప్రజలయెదుట ఆయన చెప్పిన మాటలతో అతనిని చిక్కించుకొనలేకపోయిరి. కాని ఆయన సమాధానము నకు వారు ఆశ్చర్యపడి మిన్నకుండిరి.

27. ఆ పిమ్మట పునరుత్థానమును విశ్వసింపని సదూకయ్యులు కొందరు యేసు వద్దకు వచ్చి,

28. “బోధకుడా! ఒకడు సంతానము లేక మరణించిన యెడల వాని సోదరుడు అతని భార్యను పెండ్లాడి, అతనికి సంతానము కలుగజేయవలెనని మోషే లిఖించెనుగదా!

29. అయితే మాలో ఏడుగురు సహోదరులు ఉండిరి. మొదటివాడు పెండ్లాడి సంతానము లేకయే చనిపోయెను.

30. పిమ్మట రెండవవాడు

31. ఆ పిదప మూడవవాడు, అట్లే ఏడుగురును ఆ స్త్రీని పెండ్లాడి సంతానము లేకయే మరణించిరి.

32. ఆ పిదప ఆమెయు మరణించినది.

33. ఏడుగురును ఆమెను వివాహమాడిరి కదా! పునరుత్థానమునందు ఆమె ఎవరి భార్య అగును?" అని అడిగిరి.

34. అందుకు యేసు “ఈ జీవితములో వివాహ ములకు ఇచ్చిపుచ్చుకొనుట జరుగును.

35. కాని పునరుత్థానమునకు యోగ్యులగువారు రానున్న జీవిత మున వివాహముకొరకు ఇచ్చిపుచ్చుకొనరు.

36. పునరుత్థానులగుటచే వారికి ఇక చావులేదు. పునరుత్థాన కుమారులగుట వలన వారు దేవదూతలతో సమానులు. దేవుని కుమారులు.

37. మండు చున్న ! పొదను గూర్చి మోషే ప్రస్తావించుచు, పునరుత్థాన విషయమై ప్రభువు అబ్రహాము దేవుడనియు, ఈసాకు దేవుడనియు, యాకోబు దేవుడనియు పలికెను.

38. దేవుడు జీవితులకేగాని, మృతులకు దేవుడు కాడు. ఏలయన, ఆయన దృష్టికి అందరు సజీవులే” అని వారికి సమాధానము ఇచ్చెను.

39. అపుడు ధర్మశాస్త్ర బోధకులు కొందరు “బోధకుడా! నీవు సరిగా సమాధానమిచ్చితివి" అనిరి.

40. ఆ పిదప, వారు ఆయనను మరేమియు అడుగుటకు సాహసింపలేదు.

41. కాని యేసు వారితో “క్రీస్తు దావీదు కుమా రుడని ప్రజలు ఎందుకు చెప్పుచున్నారు?

42. దావీదు స్వయముగా కీర్తనల గ్రంథములో ఇట్లు చెప్పియున్నాడు:

43. 'నేను నీ శత్రువులను , నీ పాదముల క్రింద ఉంచువరకును నీవు నా కుడి ప్రక్కన కూర్చుండుమని, ప్రభువు నా ప్రభువుతో పలికెను.'

44. తనను ప్రభువని సంబోధించిన దావీదునకు ఆయన కుమారుడు ఎట్లు అగును?” అని పలికెను.

45. ప్రజలందరు వినుచుండ యేసు తన శిష్యు లకు,

46. “మీరు ధర్మశాస్త్ర బోధకులను గురించి మెలకువగా ఉండుడు. వారు నిలువుటంగీలు ధరించి తిరిగెదరు. వీధులలో వందనములు, ప్రార్థనామందిర ములలో ఉన్నత స్థానములు, విందులలో ప్రధానాసనములు కోరుదురు.

47. వారు వితంతువుల ఇండ్లను దోచుకొందురు. ఆడంబరమునకై దీర్ఘ ప్రార్థనలు చేయునట్లు నటించుదురు. వారు కఠిన శిక్షకు గురియగుదురు” అని చెప్పెను.