ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

Acts chapter 26 || Telugu catholic Bible || అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయము

 1. అంతట అగ్రిప్ప పౌలుతో, “నీవునీ తరపున వాదించుకొనుటకు నేను అనుమతించుచున్నాను” అనెను. పౌలు తన చేయిచాచి తన పక్షమున ఇట్లు వాదించుకొనసాగెను:

2.“అగ్రిప్పరాజా! యూదులు నా మీద మోపిన వాటిని అన్నింటిని గూర్చి మీ ముందు నా తరపున నేను వాదించుకొనుటకు నేనెంతో ధన్యుడను.

3. మీకు సమస్తయూదుల ఆచారములును, వివాదములును కొట్టినపిండియే గదా! అందుచే నేను చెప్పుకొను దానిని ఓర్పుతో వినుడని మిమ్ము బతిమాలుకొనుచున్నాను.

4. నేను నా బాల్యమునుండి ఎట్లు జీవించు చున్నానో, యూదులందరు ఎరుగుదురు. మొదటి నుండి నా జీవితము అంతయు నా మాతృభూమి లోను, యెరూషలేములోను గడిపితినని వారికి తెలియును.

5. వారు సాక్ష్యమీయదలచినచో నేను మొదటినుండియు నిష్ఠాగరిష్ఠమైన మా మతవర్గములో సభ్యుడనుగా పరిసయ్యుడనుగా జీవించిన విషయము వారు ఎరిగినదే.

6. మా పూర్వులకు దేవుడు చేసిన వాగ్దానమునందు నాకు నమ్మకము ఉండుటచే ఇప్పుడు నేను విచారింపబడుటకు ఇచ్చట నిలువబడి ఉన్నాను.

7. ఈ వాగ్దానమును పొందు నమ్మకముతో మా పండ్రెండు గోత్రముల ప్రజలు రేయింబవళ్లు దేవుని ఆరాధించుచున్నారు. ఓ రాజా! ఆ నమ్మకము కొరకే నేను యూదులచే నేరస్థునిగా ఎంచబడితిని.

8. దేవుడు మృతులను జీవముతో లేపుటను యూదు లగు మీరు ఏల నమ్మలేదు? ,

9.“ఒకప్పుడు నేను నజరేయుడగు యేసు నామమునకు వ్యతిరేకముగా ఎంతో చేయవలెనని తల పెట్టితిని.

10. యెరూషలేములో నేను అట్లే చేసితిని. నేను ప్రధాన అర్చకులనుండి అధికారమును పొంది, పవిత్ర ప్రజలను అనేకులను చెరసాలలో వేసితిని. వారికి మరణదండన విధింపబడినప్పుడు దానికి సమ్మతించితిని,

11. ప్రార్థనామందిరము లన్నింటియందును వారిని పలుమారులు శిక్షించితిని. వారు వారి విశ్వాసమును విడనాడునట్లు ప్రయత్నించి తిని. వారిపై ఆగ్రహించి హింసించుటకై వారిని ఇతర నగరములకు కూడ వెన్నంటి తరిమితిని.

12. “నేను ఒకసారి అదే పనిమీద ప్రధాన యాజకులనుండి ఉత్తరువులను పొంది, అధికార ముతో దమస్కు నగరమునకు వెళ్ళితిని.

13. ఓ రాజా! మార్గమధ్యమున, మధ్యాహ్న సమయమున ఆకాశమునుండి నాకు ఒక వెలుగు కనబడినది. అది సూర్యుని కాంతికన్న మిన్నగా ఉండి నన్నును, నా వెంట వచ్చువారిని ఆవరించినది.

14. మేమంద రము క్రిందపడిపోయితిమి. అప్పుడు 'సౌలూ! సౌలూ! ఎందుకు నన్ను హింసించుచున్నావు? ములుకోలకు ఎదురు తన్నుట నీకే కష్టముగదా!' అని హీబ్రూ భాషలో ఒక స్వరము నాతో పలికెను.

15. 'ప్రభూ! నీవు ఎవరవు?” అని నేను అడిగితిని. అందుకు ప్రభువు, 'నీవు హింసించుచున్న యేసును నేనే.

16. నీవు లేచి నిలువబడుము. ఇప్పుడు నీవు చూచిన దానిని గూర్చి, చూడనున్న దానిని గూర్చి సాక్ష్యమిచ్చుటకు నిన్ను నా సేవకునిగా నియమించుకొనుటకై నీకిపుడు ప్రత్యక్ష మైతిని.

17. నేను నిన్ను యిస్రాయేలు ప్రజలనుండి, అన్యులనుండి కాపాడెదను. వారి కొరకు నిన్ను నేను ఇపుడు పంపుచున్నాను.

18. నీవు వారికి కనువిప్పు కలిగించి అంధకారమునుండి వెలుగులోనికి, పిశాచ ప్రభావమునుండి దేవుని వైపునకు, వారిని మరలింప వలెను. అప్పుడు నాయందలి విశ్వాసము వలన వారి పాపములు క్షమింపబడును. వారు ఎన్నుకొనబడిన దేవుని ప్రజలలో లెక్కింపబడుదురు' అని పలికెను.

19. “కనుక ఓ అగ్రిప్పరాజా! నేను పరలోకము నుండి చూచిన ఆ దర్శనమునకు అవిధేయుడను కాలేదు.

20. మొదట దమస్కులోనివారికి, యెరూషలేములోనివారికి, తరువాత యూదయా దేశమునందంతటను ఉన్నవారికి, అన్యులకు, వారి పాపముల నిమిత్తమై పశ్చాత్తాపపడి దానికి తగినట్టి క్రియలను చేయుచు, దేవుని వైపునకు మరలవలెనని బోధించితిని.

21. ఈ కారణము చేతనే నేను దేవాలయములో ఉన్నప్పుడు యూదులు నన్ను పట్టు కొని చంపప్రయత్నించిరి.

22. కాని ఈనాటివరకు నాకు దేవుడు తోడ్పడుచున్నాడు. నేను ఇక్కడ నిలుచుండి పిన్న, పెద్దలందరకు సాక్ష్యమిచ్చుచున్నాను. జరుగ బోవు దానిని గూర్చి మోషే చెప్పినది, ప్రవక్తలు వెల్లడించినది, నేను చెప్పుచున్నది ఒక్కటియే.

23. అదేమన: మెస్సియా శ్రమలు అనుభవింపవలెను. ప్రథముడుగా మృతులలోనుండి లేచి యూదులకు అన్యులకు రక్షణ జ్యోతిని వెల్లడింపవలెను.”

24. ఈ విధముగా పౌలు తన తరపున వాదించుచుండగా ఫెస్తు “పౌలు! నీవు వట్టి పిచ్చి వాడవు. నీవు నేర్చుకొన్న గొప్ప విద్యయే నిన్ను పిచ్చివానిగా చేయుచున్నది” అని బిగ్గరగా అరచెను.

25. అందుకు పౌలు “ఘనమైన ఫెస్తూ! నేను పిచ్చివాడను కాను. నేను చెప్పుచున్న మాటలు యథార్గములు.

26. రాజుకు ఈ సంగతులు తెలియును గనుక నేను ధైర్యముగా మాట్లాడుచున్నాను. వాటిలో ఒకటియు అతని నుండి దాచబడలేదని రూఢిగా నమ్ముచున్నాను. ఇది ఒక మారుమూల జరిగిన విషయము కాదు."

27. “అగ్రిప్పరాజా! మీరు ప్రవక్తలను నమ్ముచున్నారా? మీరు నమ్ముచున్నారని నాకు తెలియును” అనెను.

28. అగ్రిప్పరాజు పౌలుతో, “ఇంత స్వల్పకాలములోనే నన్ను క్రైస్తవునిగా చేయదల చుచున్నావా?" అని పలుకగా, పౌలు,

29. “స్వల్ప కాలము కానిండు, దీర్ఘకాలము కానిండు. ఈనాడు నేను చెప్పునది వినుచున్న మీరును, ఇచ్చటనున్న ఇతరులును, ఈ నా సంకెళ్ళు మినహా నా వలె కావలె నని, నేను దేవుని ప్రార్ధించుచున్నాను” అనెను.

30. అప్పుడు అగ్రివ్పరాజు, బెర్నీను, అధిపతియగు ఫెసు, మిగిలిన వారందరును లేచిరి.

31. వారు అచ్చటనుండి పోవుచు, “ఇతడు చంపబడు టకుగాని, లేదా, చెరలో బంధింపబడుటకుగాని తగిన నేరమేదియు చేసియుండలేదు” అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి.

32. అగ్రిప్పరాజు ఫెసుతో, “చక్రవర్తికి నివేదించుకొందును అని పలుక కుండినచో, ఇతడు విడుదలచేయబడి ఉండెడివాడే” అనెను. 

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services