1. అంతలో సముద్రమునుండి ఒక క్రూర మృగము వెలుపలికి వచ్చుట గమనించితిని. దానికి పది కొమ్ములు, ఏడుతలలు. అన్ని కొమ్ములకును కిరీటములు ఉండెను. దాని తలలపై ఒక దుష్టనామము వ్రాయబడి ఉండెను. 2. ఆ మృగము ఒక చిరుత పులివలె ఉండుట గమనించితిని. దాని పాదములు ఎలుగుబంటి పాదములను పోలిఉండెను. నోరు సింహపునోటివలె ఉండెను. ఆ భయంకర సర్పము తన శక్తిని, సింహాసనమును, విస్తారమైన అధికారమును ఆ మృగమునకు ఒసగెను. 3. ఆ మృగము తలలలో ఒకటి తీవ్రముగ గాయపడి చావుదెబ్బ తగిలినట్లు ఉండెను. కాని గాయము మాని ఉండెను. భువి యంతయు ఆశ్చర్యముతో నిండినదై ఆ మృగమును అనుసరింపసాగెను. 4. సర్పము తన అధికారమును ఆ మృగమునకు ఒసగుటచే ప్రజలందరు ఆ సర్ప మునుపూజించిరి.వారు ఆమృగమును కూడ పూజించిరి. “ఈ మృగము వంటివారు ఎవరున్నారు? దానితో పోరాడగలవారు ఎవరు?” అని వారు పలుకసాగిరి. 5. ఆ మృగమునకు కుత్సితపు పలుకులను దేవదూషణములను పలుకు ఒక నోరు ఇవ్వబడెను. అది నలువది రెండు నెలలపాటు అధికారము కలిగి ఉండుటకు అనుమతింపబడెను. 6. కనుక దేవుని, ఆయన నామమును, ఆయన నివాసమును, పరలోక వాసులను దూషించుటకు అది తన నోరు తెరచెను. 7. అది పరిశుద్దులతో, పోరాడి వారిని ఓడించుటకు కూడ అనుమతింపబడెను. ప్రతి